రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ 'ఎవడు' చిత్రం ప్రారంభం

శుక్రవారం, 9 డిశెంబరు 2011 (15:35 IST)
WD
రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సమంత హీరోయిన్‌గా 'ఎవడు' సినిమా ఆరంభమైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో రామ్‌ చరణ్‌పై చిరంజీవి క్లాప్‌ కొట్టగా ముహూర్తపు షాట్‌ తీశారు. ఈ కార్యక్రమానికి సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రానికి పిఆర్‌.పి నాయకుడు గంటా శ్రీనివాసరావు నిర్మాత. దిల్‌ రాజు సమర్పకుడు.

దిల్‌రాజు మాట్లాడుతూ, బృందావనం తర్వాత వంశీ పైడిపల్లి మా బేనర్‌లో దర్శకత్వం చేస్తున్నాడు. అప్పుడే కథ చెప్పాడు. బాగుంది. రామ్‌చరణ్‌కు, చిరంజీవికి, అల్లు అరవింద్‌కు బాగా నచ్చింది. తెలుగులో కొత్తరకం బ్యాకడ్రాప్‌తో వస్తున్న చిత్రమిది. కమర్షియల్‌ అంశాలతో రూపొందుతుంది. 2012 జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌ప్రారంభమవుతుందని అన్నారు.

దేవీశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ, మా కాంబినేషన్‌లో మంచి హిట్స్‌ వచ్చాయి. అంతా కలిసిన టీమ్‌తో చేయడం ఆనందంగా ఉందని అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, దిల్‌రాజు బేనర్‌లో నాకిది 3వ సినిమా. నా కథకు మంచి టీమ్‌ దొరికింది. అశ్విన్‌,వంశీలు నాకు చాలా సహకరించారని చెప్పారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, రాజుగారి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. అల్లు అర్జున్‌.. బన్నీ.. గెస్ట్‌ రోల్‌ చేస్తున్నాడు. సాయికుమార్‌ ప్రస్థానం సినిమా చూసి పెద్ద ఫ్యాన్‌ అయ్యాను. ఆయనతో నటించడం చాలా ఆనందంగా ఉంది.. అన్నారు. మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి