రామ్ చరణ్ 'ఎవడు'.. డిఫరెంట్ పాత్రలో సాయి కుమార్!

గురువారం, 9 జనవరి 2014 (11:11 IST)
FILE
డైనమిక్‌స్టార్ సాయి కుమార్ తాజాగా నటించిన చిత్రం 'ఎవడు'. ఈ సినిమాలో సాయి కుమార్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. తన కెరీర్లో 'ఎవడు' మరిచిపోలేని సినిమా అని సాయి కుమార్ అంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

"నా జీవితంలో ఎన్నో సినిమాలలో నటించాను. ఎన్నో రకాల పాత్రలు పోషించాను. అయితే, 'ఎవడు' సినిమాలో నేను చేసిన ధర్మ పాత్ర మాత్రం చాలా డిఫరెంట్. రామ్ చరణ్‌తో సరి సమానంగా నా సన్నివేశాలు వుంటాయి. నటుడిగా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందాను. దర్శకుడు వంశీ పైడిపల్లి నా పాత్రను తీర్చి దిద్దిన విధానం చాలా బాగుంది. నా మనసుకు బాగా దగ్గరైన పాత్ర ఇది" అంటున్నాడు సాయి.

వెబ్దునియా పై చదవండి