"రోషం" ఆడియో ఆవిష్కరణ

WD

శ్రీకృష్ణ, మమత హీరోహీరోయిన్లుగా సమీ దర్శకత్వంలో రూపొందిన "రోషం" చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వి. సముద్ర ఆడియో కేసెట్‌ను ఆవిష్కరించారు. ఆడియోసీడీని "జంక్షన్" దర్శకుడు అనిల్ కృష్ణ విడుదలచేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పెండెం బాలకృష్ణ మాట్లాడుతూ.. రెండేళ్లనాటి శ్రమ ఫలించిందని, సినిమా నిర్మించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలని తెలుసుకున్నానని చెప్పారు. స్నేహితుల సహకారంతో ఈ చిత్రాన్ని రూపొందించానని వెల్లడించారు. ఓ సందర్భంలో సినిమా ఆగిపోతే... మమత తనపై ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి ఆదుకుందని, ఈ చిత్రం ఆడినా ఆడకపోయినా... ఇందులో పనిచేసిన వారికి మరో అవకాశం వస్తే అదే అదృష్టంగా భావిస్తానని నిర్మాత చెప్పారు.

సంగీత దర్శకుడు సాల్మన్ మాట్లాడుతూ.. రీరికార్డింగ్‌కు మంచి అవకాశమున్న చిత్రమిదని, తప్పకుండా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లవ్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నామని హీరో శ్రీకృష్ణ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి