శింబు - నయనతార: ఏడేళ్ల ఎడబాటు తర్వాత మళ్లీ?

మంగళవారం, 7 జనవరి 2014 (14:22 IST)
FILE
కోలీవుడ్ రొమాంటిక్ ప్రేమ జంట అంటే శింబు-నయనతారేనని అందరూ చెబుతారు. ఎందుకుంటే వీరిద్దరి మధ్య ప్రేమాయణం అప్పట్లో అంత హాట్ సాగింది. వీరిమధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయితే మళ్లీ ఇపుడు ఏడేళ్ల ఎడబాటు తర్వాత కలుసుకున్నారు.

తాజాగా వీరిద్దరూ కలిసి పాండిరాజ్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగు గతంలోనే మొదలైనా, ఇద్దరూ కలసి షూటింగులో శుక్రవారం నుంచి పాల్గొంటున్నారు.

ఇకపై వీరి బంధం ఎలా కొనసాగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నయన్ మళ్లీ శింబు మాయలో పడుతుందా? అతని మాటల గారడీకి ఆకర్షితురాలైపోతుందా అనేది వేచి చూడాల్సిందే.. ఏమైనా లవర్స్ కదా.. మళ్లీ వీరి ప్రేమాయణం చిగురించకమానదని కోలీవుడ్ సినీ పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి