సంక్రాంతి సందడి: వెండితెరపై మహేష్, చెర్రీ... బుల్లితెరపై పవన్!

శనివారం, 7 డిశెంబరు 2013 (10:32 IST)
FILE
సంక్రాంతి పండగకు తమ అభిమానులకు కనువిందు చేయడానికి సిద్ధమయ్యారు మహేష్, చెర్రీ. 'ఎవడు'గా రామ్ చరణ్, '1 నేనొక్కడినే'అంటూ మహేష్ బాబు సంక్రాంతికి సందడి చేయనున్నారు. అయితే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కూడా సంక్రాంతికి సందడి చేయనున్నాడు. పవన్ కల్యాణ్ కొత్త సినిమా లేదు కాబట్టి తన 'అత్తారింటికి దారేది' సినిమాతో బుల్లితెరపై సంక్రాంతికి సందడి చేయనున్నాడు.

ప్రేక్షకులకు వినోదాల విందును పంచిన 'అత్తారింటికి దారేది' చిత్రం కలెక్షన్లలో టాలీవుడ్ ఆల్‌టైం రికార్డు నెలకొల్పిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు ముందే మాటీవీ సుమారు 9 కోట్లకు దీని శాటిలైట్ హక్కులను కైవసం చేసుకుంది. ఇది విడుదలై జనవరి నాలుగుతో 100 రోజులవుతుంది. దాంతో, సంక్రాంతికి ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేయడానికి మాటీవీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

అందుకు తగ్గట్టే ఇప్పటి నుంచే మార్కెటింగ్ వ్యవహారాలను మొదలుపెట్టారని అంటున్నారు. మామూలుగా పవన్ కల్యాణ్ సినిమాలకు టీవీలో ఎక్కువుగా రేటింగు వుంటుంది. 'అత్తారింటికి దారేది' బ్లాక్‌బస్టర్ కాబట్టి ఈసారి ఆ రేటింగు మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి