సికింద్రాబాద్ పోలో గ్రౌండ్స్‌లో చరణ్-ఉపాసనల హల్‌చల్!

మంగళవారం, 6 సెప్టెంబరు 2011 (22:03 IST)
WD
మగధీర త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి.రెడ్డి మనుమరాలు ఉపాసనను పెళ్లి చేసుకోబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన ఉపాసనను మనువాడనున్న రామ్‌చరణ్ ఆమెతో కలిసి తొలిసారి పబ్లిక్ ముందుకొచ్చాడు.

సికింద్రాబాద్ పోలో గ్రౌండ్స్‌లో జరిగే పోలో పోటీలను తిలకించేందుకు రామ్‌చరణ్, ఉపాసనలు హాజరయ్యారు. తొలిసారి పబ్లిక్ ముందుకొచ్చిన ఈ జంట చూడముచ్చటగా అందరినీ ఆకట్టుకున్నారు. తన పోలో టీమ్‌ను ఉత్సాహపరిచేందుకు వచ్చిన రామ్ చరణ్ గుర్రంపై విన్యాసాలు కూడా చేశాడు. దీన్ని తిలకించిన ఉపాసన చెర్రీని అభినందించింది.

మొత్తానికి పోలో గ్రౌండ్స్‌లో చెర్రీ, ఉపాసనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చరణ్-ఉపాసన పోలో పోటీలను జంటగా తిలకించడం ద్వారా మైదానంలో సందడి వాతావరణం నెలకొంది.

వెబ్దునియా పై చదవండి