పాపం దిల్ రాజు ఏ టైమ్లో ఎవడు సినిమాను చేయాలని డిసైడయ్యడోగానీ ఆ సినిమా మొదట నుండి పురిటినొప్పులతో బాధపడుతుంది. ముందుగా ఈ సినిమాను 'అత్తారింటికి దారేది' సినిమా మీద పోటీగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఆ తర్వాత సమైక్య ఉద్యమం దెబ్బకు మొత్తం టాలీవుడ్ అంతా సినిమాలని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఆ తర్వాత సినిమా రిలీజ్ చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కానీ దిల్ రాజు ఎందుకో వెనక్కు తగ్గుతూ వచ్చాడు. ఈ సినిమా కన్నా లేటుగా వచ్చిన 'రామయ్య వస్తావయ్య' సినిమాను రిలీజ్ చేసాడు కానీ 'ఎవడు' బాక్సులను మాత్రం ల్యాబులకే పరిమితం చేశాడు. అయితే ఇప్పుడు ఏది ఏమైనా డిసెంబర్ 9న సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.
అయితే డిసెంబర్ 9న రానున్న సోనియా గాంధీ పుట్టిన రోజు దిల్ రాజును మళ్లీ టెన్షన్ పెడుతుందట. ఈ రోజున కాంగ్రెస్ హైకామాండ్ విభజన అంశం మీద కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుండగా మళ్లీ రెండు ప్రాంతాలలో ఎక్కడైనా కనుక ఉద్యమాలు చెలరేగితే మళ్లీ వాయిదా వేసుకోవాల్సి వస్తుందని దిల్ రాజు తలపట్టుకుంటున్నాడట.
ఒకవేళ అప్పడు కూడా ఆగితే సంక్రాంతికి మహేష్ 1, బన్నీ 'రేసుగుర్రం' ఇలా చాలా సినిమాలు బరిలో ఉన్నాయి కనుక ఎవడుకి కష్టకాలమే. మరి రాజు ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి!