ఎన్నికల ప్రచారంలో పాల్గొని కారు ప్రమాదంలో గాయపడిన మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రం షూటింగ్ ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై కొడాలి నాని, వల్లభనేని నిర్మిస్తున్న ఈ చిత్రం ఏకధాటిగా మూడు నెలల పాటు జరుగనుంది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మూడు నెలల పాటు ఏకధాటిగా జరిగే షూటింగ్లో తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్పైనే పూర్తి దృష్టి సారిస్తానని చెప్పారు.
తానా సభలకు వెళ్ళడంలేదు: అమెరికాలో జరుగనున్న తానా మహాసభలకు వెళ్తున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఎన్.టి.ఆర్. మాట్లాడుతూ, ప్రస్తుతం షూటింగ్లో బిజీ బిజీగా ఉండడంతో తానా సభలకు వెళ్ళే అవకాశం లేదని వెల్లడించారు.