మగరాయుళ్లతో కలిసి పేకాట ఆడుతూ ప్రముఖ టాలీవుడ్ హాస్యనటి కళ్యాణి పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని జహంగీర్నగర్లో పేకాట స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మందిని అరెస్ట్ చేసి రూ.77వేల నగదు, 8సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో సినీనటి కళ్యాణి (కరాటే కళ్యాణి) కూడా ఉన్నారు.
ఆదివారం రాత్రి వనస్థలిపురం పరిధిలోని జహంగీర్కాలనీలో పేకాట స్థావరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఓ అపార్ట్మెంట్లో పేకాడుతున్న సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణితోపాటు 11మందిని అరెస్ట్చేశారు.