తాజాగా అక్కి విశ్వనాధరెడ్డి ఆ కోవలో చేరారు. అరవింద్ కృష్ణ హీరోగా మీనాక్షి దీక్షిత్, పూజ రామచంద్రన్ హీరోయిన్స్గా మూన్లైట్ డ్రీమ్స్ పతాకంపై 'అడవి కాచిన వెన్నెల' చేశాడు. ఈ చిత్రం గురించి ఆయన చెబుతూ... లంకెబిందెలు నేపథ్యంలో కథ వుంటుంది. ఆగస్ట్ 1న విడుదల కానుంది అన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తూ బెంగుళూరు, కొరియా, చైనా వంటి పలు ప్రాంతాలను తిరిగాను. కథలు రాస్తుండేవాడిని.
దర్శకుడిగా ఎవరి దగ్గరా అనుభవంలేదు. కేవలం నెట్లో దర్శకత్వానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుని ధైర్యంగా ముందుకు వచ్చాను. నెట్లో మేకింగ్ టెక్నాలజీ గురించి విపులంగా తెలుసుకున్నాను. కడపలోని కలసపాడు గ్రామంలో పుట్టి పెరిగి ఆ తర్వాత టౌన్, సిటీ, విదేశాల్లో పెద్ద నగరాలకు నా ప్రయాణం సాగడంతో పలురకాల మనుషుల ప్రవర్తలను, సంస్కృతిని, మనుషుల్లోని మార్పులను పరిశీలించాను. అది సినిమాకు చాలా ఉపయోగపడింది అన్నారు.