చిత్ర రంగంలో దర్శకుడు రాఘవేంద్రరావు, గుమ్మడి గోపాలకృష్ణ, శాస్త్ర, సాంకేతిక రంగానికి గాను డా.ఐ.కే. వరప్రసాద రెడ్డి, జ్యోతి సురేఖ, వంశీ రామరాజు, విద్యారంగంలో ఎంఎన్ రాజు, జస్టిస్ పర్వతరావు, ఆరోగ్య విభాగంలో సేవలందించిన డా. గోపీచంద్ మన్నం, పౌరసేవల విభాగంలో సంపత్ కుమార్ లు అక్కినేని పురస్కారాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఏఎన్ఆర్ అనే మూడు అక్షరాలే తమకు నాన్న, స్నేహితుడు, తత్వవేత్త అని అక్కినేని నాగార్జున తెలిపారు. నాన్న నాల్గవ తరగతి చదివినా... నాలుగు తరాలు గర్వించేలా జీవించారని నాగార్జున గర్వంగా చెప్పారు. ఏఎన్ఆర్ పిల్లలుగా తామెంతో గర్విస్తున్నామన్నారు.