భర్తతో కలిసి సెలబ్రేషన్స్‌కు అమలాపాల్ రెడీ.. ఇంతలోనే కోర్టు షాక్!

సోమవారం, 22 డిశెంబరు 2014 (11:52 IST)
భర్తతో కలసి కెనడా, అమెరికా దేశాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి రెడీ అవుతున్న మల్లూ బేబీ అమలాపాల్‌కి కోర్టు చిన్న షాక్ ఇచ్చింది. ఇతర సంస్థల ఆభరణాలకు సంబంధించిన ప్రచార ప్రకటనలలో ఆమె నటించకూడదంటూ ఎర్నాకుళం కోర్టు ఆదేశించింది. కొచ్చీకి చెందిన ఓ జ్యూయలరీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో అమలాకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ ఏడాది మే నెలలో తాము 30 లక్షలు అమలాకు చెల్లించి తమ సంస్థ తరఫున ప్రచారకర్తగా కాంట్రాక్టు చేసుకున్నామనీ, అది పూర్తయ్యేలోగా మరే ఇతర జ్యూయలరీ సంస్థకు తాను పనిచేయకూడదనీ, అయితే ఈ కాంట్రాక్టును ధిక్కరించి మరో సంస్థకు ప్రచారం చేయడానికి అమల ఒప్పుకుందనీ, దానిని నిలుపుదల చేయాలనీ సదరు సంస్థ కోర్టుకి ఎక్కింది. ఈ విషయంలో అమలా పాల్‌కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి