ఆటో జానీ కథ పూర్తిగా నాదే... తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు... పూరీ ట్వీట్

బుధవారం, 13 మే 2015 (16:11 IST)
చిరంజీవి 150వ చిత్రం ఆటో జానీ కథ పూర్తిగా తన సొంతమనీ, దాన్ని రాసుకున్నది తనేనని టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెలియజేశారు. ఆటో జానీ కథ తనది కాదనీ, ఎవరో కథను తాను తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను పూరీ జగన్నాథ్ ఖండించారు. ఈ మేరకు పూరీ ట్విట్టర్లో స్పందించారు. మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దంటూ ట్వీట్ చేశారు.
 
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి... 2007 తర్వాత సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు తాజాగా ఆయన నటించనున్న 150వ చిత్రం లైన్లోకి వచ్చింది. దీనిపై గత రెండుమూడేళ్లుగా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు రామ్ చరణ్ నిర్మాతగా పూరీ దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రం తెరకెక్కబోతోంది.

వెబ్దునియా పై చదవండి