ఎన్నడూ లేని విధంగా ఈ సారి మా ఎన్నికలు పోటా పోటీగా జరిగాయి. మా అధ్యక్ష పదవి కోసం రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీపడ్డారు. ఈ రెండు ప్యానెల్ లో ఉన్నవారు ఒకరినొకరు దూషించుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల విషయాన్ని పక్కనపెట్టి పర్శనల్ విషయాలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు.
ఇంకా ఆ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. వీరి వ్యవహారం వినోదంగా మారింది. ఇదిలా ఉంటె నిన్న మా ఎలక్షన్స్ జరిగిన విషయం తెలిసిందే. మొత్తం ఇందులో జీవితకాల సభ్యులు 709 మంది ఉండగా, గౌరవ సభ్యులు ఇద్దరు, సీనియర్ సిటిజన్స్ 28 మంది ఉన్నారు.