తెలుగులో ధనుష్‌ 'విఐపి'... ఎగబడుతున్నారట...

శనివారం, 30 ఆగస్టు 2014 (19:11 IST)
'ఆడుకలమ్‌'తో జాతీయ అవార్డు పొందిన తమిళ నటుడు ధనుష్‌ స్వంత నిర్మాణ సంస్థలో తానే హీరోగా 'వేలై ఇల్లా పట్టదారి' (విఐపి) అనే చిత్రాన్ని నిర్మించారు. కథానాయకుడిగా అతనికి 25వ సినిమా. వేల్‌రాజ్‌ దర్శకుడిగా పరిచమయ్యారు. అమలాపాల్‌ కథానాయిక. తమ్ముడు ఉద్యోగం చేసుకుంటుంటే.. ఉద్యోగాన్వేషణలో వుండే అన్న కథ ఇది. 
 
పట్టా పుచ్చుకుని నాలుగేళ్లు గడిచినా ఉద్యోగం రాని పక్షంలో ఈ యువకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది కథ. ఇటీవలే జులైలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తెలుగు హక్కుల కోసం పలువురు ప్రయత్నిస్తున్నారు. త్వరలో ఎవరికి హక్కులు దక్కుతాయో తెలియనుంది.

వెబ్దునియా పై చదవండి