మెగా స్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్బంగా వివిధ ప్రాంతాల్లోని 25 వేల మందికిపైగా రక్తదానం చేసారు. ఈ రక్తదాన కార్యక్రమాన్ని హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో అల్లు అరవింద్ ప్రారంభించారు. ఒక్క హైదరాబాద్లోనే వివిధ రక్తదాన శిబిరాలలో 2,365 మందికిపైగా అభిమానులు రక్తదానం చేసారు.
చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఫిల్మ్ నగర్ శ్రీదాసాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష తమళపాకులతో చిరంజీవి పేరు మీద పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ.. అన్నయ్య సినిమా కోసం ఎదురుచూస్తున్నామని, రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి 150వ సినిమా త్వరలో సెట్స్ పైకి రావాలని ఆశించారు.