నవీన్ సరసన అప్పటి నటి మేనక కుమార్తె కీర్తి సురేష్ నాయికగా పరిచయమవుతుంది. కాగా, టాకీ, పాటలతో సహా చిత్రం పూర్తయిందని నిర్మాత చంటి అడ్డాల తెలియజేశారు. నిర్మాణానంతర పనుల్లో భాగంగా ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతుందని వెల్లడించారు.
వచ్చేవారం టైటిల్ ప్రకటిస్తామని చెప్పారు. మిగిలిన కార్యక్రమాలు పూర్తిచేసి జూన్లో ప్రేక్షకులముందుకు తీసుకువస్తామని అన్నారు. తమ బేనర్ నుంచి మరో కొత్త హీఓను పరిచయం చేయడం చాలా ఆనందంగా వుందని పేర్కొన్నారు. ఇందులో నాగబాబు కీలక పాత్రను పోషిస్తున్నారనీ, విలన్గా చేస్తున్న రాహుల్దేవ్ గెటప్ భిన్నంగా వుంటుందన్నారు. ఈ చిత్రానికి మాటలు: వర్ధినీడి సురేష్, సంగీతం: అచ్చు, ఛాయాగ్రహణం: సురేష్ రగుతు, సమర్పణ: అడ్డాల ధనలక్ష్మి.