రాంగోపాల్ వర్మ ఈసారి ఏకంగా గణనాథునిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్లో తనపై తిట్ల వర్షం కురిపించుకున్న తర్వాత వెనువెంటనే క్షమాపణలు తెలిపారు. ఇంతకుముందు ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సారీ చెప్పని వర్మ తొలిసారిగా గణేష్ మహరాజ్ పై చేసిన ట్వీట్స్ పై క్షమాపణలు తెలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తనకు గణేషునిపై ఎలాంటి ఉద్దేశం లేదనీ, ఐతే తన కామెంట్లు ఎవరినైనా బాధిస్తే క్షమాపణులు కోరుతున్నానంటూ ట్విట్టర్ లో చెప్పుకున్నారు.