అంజలి కథానాయికగా రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందిన 'గీతాంజలి' ఈ ఏడాది విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. క్రేజీ మీడియా ప్రొడక్షన్ పతాకంపై ఈ చిత్రాన్ని చినబాబు నిర్మించనున్నారు. అతి త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... ''నాకెంతో నచ్చిన చిత్రం గీతాంజలి. ఆ చిత్ర దర్శకుడు రాజ కిరణ్లో మంచి దర్శకుడు ఉన్నాడు.
ఆయన పనితీరు నచ్చి, ఓ చిత్రం చేయాలనుకున్నాను. అయితే వేరే కథతో కాకుండా గీతాంజలి కథతోనే సినిమా చేయాలనుకున్నాను. రాజకిరణ్ కూడా ఎంతో ఆనందంగా ఒప్పుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన తారాగణం కూడా భారీగానే ఉంటుంది. ఓ ప్రముఖ కథానాయిక, కథానాయకుడు ఇందులో నటిస్తారని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీనివాస్ వెలిగొండ, కెమెరా: రవి, కథ-దర్శకత్వం: రాజ కిరణ్, నిర్మాత: చినబాబు.