ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం, సంగీత మాంత్రికుడు ఏ.ఆర్. రెహ్మాన్ల కాంబినేషన్లో విడుదలై, హిట్టు కొట్టిన తాజా చిత్రం 'ఓకే కన్మణి'. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ 'ఓకే బంగారం' పేరుతో విడుదల చేశారు. తమిళనాడులో ఈ క్లాసీ లవ్ స్టొరీ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది.