రేప్ కేసులో ట్విస్ట్ : మైత్రేయ నిజంగానే డైరక్టర్ రిషి భార్యనా?

బుధవారం, 3 సెప్టెంబరు 2014 (11:36 IST)
కేంద్ర రైల్వే శాఖామంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను రేప్ చేశాడంటూ, తనను పెళ్ళి చేసుకుని ఇప్పుడు మరో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని కోర్టుకి ఎక్కి కేంద్ర మంత్రి గారికి, ఆయన పుత్రరత్నానికి ముచ్చెమటలు పట్టిస్తున్న కన్నడ హీరోయిన్ మైత్రేయ ఇప్పుడు చిక్కుల్లో పడింది. 
 
ఈ వర్ధమాన నటి మైత్రేయకు తనకు దశాబ్దకాలం క్రితమే వివాహమైందని, అందువల్ల కాపురానికి ఆమె తన వద్దకు వచ్చేలా ఆదేశించాలని కోరుతూ కన్నడ దర్శకుడు రిషి కోర్టును ఆశ్రయించాడు. దీంతో రేప్ కేసులో సరికొత్త ట్విస్ట్ ఆరంభమైంది. తాను చాలా అమాయకురాలిని అయినట్టు, తనను మంత్రి కొడుకు మోసం చేశాడన్నట్టు చెప్పుకొస్తున్న మైత్రేయ దర్శకుడు రిషి పిటిషన్‌కి సమాధానం ఎలా చెప్పుకుంటుందో చూడాలి. 

వెబ్దునియా పై చదవండి