పూరీ, ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రానికి 'టెంపర్' అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్తయింది. ఈ భారీ షెడ్యూలులో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్లపై అక్కడి పలు లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో యూనిట్ తిరిగి హైదరాబాదు చేరుకుంది.