మాస్ మహారాజా రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన 'కిక్' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ కిక్ టీమ్తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'కిక్-2' ఆగస్ట్ 20 ఉదయం గం. 8.43 ని||లకు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. నటరత్న ఎన్.టి.రామారావు చిత్రంపై తీసిన ఫస్ట్ షాట్కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్నివ్వగా, మాస్ మహారాజా రవితేజ కెమెరా స్విచ్చాన్ చేశారు. స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ షాట్ను డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ ప్రారంభోత్సవంలో నందమూరి రామకృష్ణ, ఠాగూర్ మధు, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, భోగవల్లి ప్రసాద్, భోగవల్లి బాపినీడు, మహేంద్రబాబు తదితరుల పాల్గొన్నారు.