ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ తనకు బాలీవుడ్, టాలీవుడ్ రెండు ముఖ్యమేనని స్పష్టం చేసింది. బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల్లో ప్రతిభ ఉన్న నటులు చాలామంది ఉన్నారని అంటున్నది. రెండు పరిశ్రమల్లో పనిచేస్తూ తానూ సరైన మార్గంలో పయనిస్తున్నట్లు విశ్వాసం వ్యక్తంచేసింది.
ఇదిలా ఉంటె ఈ అమ్మడుకి అవకాశాలు ఈమధ్య బాగా వస్తున్నాయని సినీ జనం అంటున్నారు. ఆమెని కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా, తనని హీరోయిన్గా తీసుకోవాలని అమీర్ ఖాన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. దాంతో అమీర్ సరసన కృతిసనన్ హీరోయిన్గా చేస్తుందని బాలీవుడ్ కథనాలు మొదలయ్యాయి.