నందమూరి హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'లయన్'. నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ 'లయన్' చిత్రంలో త్రిష, రాధికా ఆప్టే కథానాయికలుగా నటిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని మే డే రోజైన మే నెల ఒకటో తేదిన విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకోసం నిర్మాతల సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలొచ్చాయి.