'మా' ఫలితాల జాప్యానికి మురళీ మోహన్ కారణమా...?!!

బుధవారం, 1 ఏప్రియల్ 2015 (13:53 IST)
ఉత్కంఠ పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గత ఆదివారం జరిగాయి. ఐతే కోర్టు ఆదేశించే వరకూ ఎన్నికల ఫలితాలను ప్రకటించరాదన్నది తెలిసిందే. ఈ నేపధ్యంలో మంగళవారంనాడు ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. ఐతే విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వీడియోను సమర్పించలేదు. దీంతో సిటీ సివిల్ కోర్టు అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన వీడియోను సమర్పించాలని ఆదేశిస్తూ కేసును ఈ నెల 7వ తేదీకి వాయిదా వేశారు. 

 
ఐతే ఈ వీడియోను సమర్పించాల్సిన ప్రస్తుత అధ్యక్షుడు మురళీ మోహన్ పట్టించుకోలేదనీ, అందువల్లే ఈ జాప్యం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన వీడియో సమర్పణకు జాప్యం ఎందుకు చేశారబ్బా.... అంటూ కొందరు చర్చలు కూడా చేసుకుంటున్నారు. మొత్తమ్మీద మా ఫలితాలపై ఉత్కంఠత వచ్చే వారం వరకూ సాగుతుంది.

వెబ్దునియా పై చదవండి