మహేష్ సరసకు ఇంగ్లాండ్ భామ... ''బ్రహ్మోత్సవం'' తర్వాతే...

శనివారం, 27 జూన్ 2015 (16:43 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో హాట్ బ్యూటీగా హల్‌చల్ చేస్తున్న ఇంగ్లాండ్ భామ అమీ జాక్సన్ తాజాగా టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించనున్నది. ఇటీవల విక్రమ్ సరసన ''ఐ'' సినిమాలో అలరించిన ఈ భామ ఇప్పుడు కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉంది. అక్కడ యంగ్ హీరోలు ధనుష్, ఉదయనిధి స్టాలిన్, విజయ్ సరసన నటించే అవకాశం అందుకుంది.
 
ఇంత బిజీలో కూడా మహేష్ సరసన నటించే ఛాన్స్ వచ్చేసరికి మారుమాట పలకకుండా టక్కున ఒప్పేసుకుందట. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న శ్రీమంతుడు విడుదలకు సిద్ధమవుతుంది. ఆ తర్వాత మహేష్ ''బ్రహ్మోత్సవం'' సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్‌లో మహేష్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి