కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్ లో గోవిందుడు అందరి వాడేలే చిత్రం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి ఊపిరాడక మృతి చెందిన విషయం విషాదాన్ని నింపింది. అభిమానులు భారీ సంఖ్యలో వస్తారని తెలిసినా.. థియేటర్ యాజమాన్యం పట్టించుకోలేదు. తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని మృతుడి బంధువులు ఆరోపిస్తూ థియేటర్ ముందు ఆందోళనకు దిగారు. కాగా మృతుడికి మరో వారంలో పెళ్లి కాబోతోందనీ, నిశ్చితార్థం కూడా జరిపినట్లు తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పెళ్లి కావలసిన తమ కుమారుడు ఇలా మృత్యువాత పడటంపై వారు రోదిస్తున్నారు.