వేడుకగా మనోజ్ - ప్రణతిరెడ్డి నిశ్చితార్థం..! సినీ, రాజకీయ నేతలు హాజరు..!

బుధవారం, 4 మార్చి 2015 (14:11 IST)
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత డాక్టర్ మోహన్ బాబు రెండో కుమారుడు, యంగ్ హీరో మంచు మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్ధ వేడుక బుధవారం వైభవంగా జరిగింది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన ఈ నిశ్చితార్థానికి పలువురు సినీ, రాజకీయ నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

 
అంతకు ముందు పురోహితులు ప్రణతిరెడ్డితో గౌరీపూజ, మనోజ్తో పూజ చేయించారు. అనంతరం మనోజ్-ప్రణతి తల్లిదండ్రులు లగ్నపత్రిక మార్చుకున్నారు. ఆ తర్వాత మనోజ్-ప్రణతి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు.
 
ఈ వేడుకకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైకాపా నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి, సుశీల్ కుమార్ షిండే, నిమ్మగడ్డ ప్రసాద్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, జస్టిస్ చలమేశ్వర్, దాసరి నారాయణరావు, పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మాజీ, నటిమణులు తాప్సీ, జయప్రద తదితరులు హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి