''మేము సైతం'' కమల్, బాలయ్య పాట-పవన్, మహేష్, వెంకీ స్కిట్!
ఏపీ తుపాను బాధితుల సహాయార్థం ఈ నెల 30న హైదరాబాదులో నిర్వహిస్తున్న భారీ ఈవెంటుకి కమల్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అయితే, నాటి కార్యక్రమంలో కేవలం ప్రేక్షకుడిలా కూర్చోకుండా, అందరితో బాటు తాను కూడా వినోద కార్యక్రమంలో పాలు పంచుకోవాలని నిశ్చయించుకున్నట్టు తెలిసింది.
అంతేగాకుండా.., 'మేము సైతం' కార్యక్రమంలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పాట పాడనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆర్కెస్ట్రాతో కలసి బాలయ్య రెండు పాటలు పాడతారని తాజా సమాచారం. అవి తన తండ్రి ఎన్టీఆర్ సినిమాలలోని సూపర్ హిట్ సాంగ్స్ అవ్వచ్చని తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన రిహార్సల్స్ చేస్తున్నారు. ఇంకా పవన్, మహేష్ బాబు ఒక స్కిట్ ... 'పెళ్లికాని ప్రసాద్' పేరుతో వెంకీ ఒక స్కిట్ ప్రిపేర్ అవుతున్నారు. ఏమైనా, ప్రేక్షకులు ఎన్నడూ వీక్షించని ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులు మేముసైతం కార్యక్రమంలో చూడవచ్చునని సినీ పండితులు అంటున్నారు.