''ప్రతి మోసం వెనుక ఇద్దరు వుంటారు. ఒకడు మోసం చేసేవాడు, మరొకడు మోసపోయేవాడు. నువ్వు రెండోవాడివి కాకుండా వుండాలంటే మొదటి వాడివై తీరాలి'' అంటూ దర్శకుడు సుధీర్వర్మ చెబుతున్నారు. స్వామిరారా చిత్రం తర్వాత నాగచైతన్య హీరోగా సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ చిత్రాన్ని చూశాక తనకు ఈ సినిమాకు అవకాశమిచ్చారని దర్శకుడు పేర్కొంటున్నారు. నాగచైతన్య పుట్టినరోజైన ఆదివారంనాడు టీజర్ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రం గురించి దర్శకుడు తెలియజేస్తున్నారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ...'''అత్తారింటికి దారేది తర్వాత మా బేనర్లో స్వామిరారా టెక్నీషియన్స్తో చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ను విడుదల చేస్తున్నాం.