దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఐటెం గర్ల్గా పేరుతెచ్చుకున్న అందాల భామ మీనాక్షి దీక్షిత్. ఈ హాట్ బ్యూటీకి ఇప్పుడు వేశ్యగా మారింది. వ్యభిచారం చేస్తూ ప్రధానమంత్రి కుర్చికే ఎసరు పెట్టింది. మీనాక్షి దీక్షిత్ అలా వ్యభిచారం చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును ఇది జరిగింది. అయితే రియల్ లైఫ్లో కాదులెండి. కేవలం రీల్ లైఫ్లో వేశ్యపాత్ర మాత్రమే.
హిందీలో ఈమె నటిస్తున్న చిత్రం ‘పీ సే పిఎం తక్.’ పి అంటే ప్రాసిట్యూషన్ , పిఎం అంటే ప్రధానమంత్రి. వ్యభిచారం చేస్తూ కాలం గడుపుతున్న ఒక వేశ్య, నాలుగు రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవి ఎలా దక్కించుకుంది అనేది ఈ చిత్ర కథాంశం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైనది. అందులో మీనాక్షి దీక్షిత్ చాలా హాట్గా నటించింది.
నిజమైన వేశ్య లాగే హాట్ హాట్గా అందాలని ప్రదర్శించింది. ఈ సినిమాలో ఆమె ప్రధానపాత్రలో నటిస్తున్నది. ఈ సినిమాతో ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయని మీనాక్షీ దీక్షిత్ భావిస్తున్నది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మీనాక్షి దీక్షిత్కు బాలీవుడ్లో ఐటెం సాంగ్, హాట్ మసాలా పాత్రల్లో అవకాశాలు రావడం ఖాయం అని అంటున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు.