జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో గల ఓ ఫ్లాట్ విషయంలో గత కొద్దిరోజులుగా డాక్టర్ కవిత, సి.కళ్యాణ్ మధ్య వివాదం నెలకొంది. ఆఫ్లాట్ మార్గంలో మెట్రోరైలు వెళ్తున్న నేపథ్యంలో అపార్ట్మెంట్ కొంత మేరకు పోయే అవకాశం ఉంది, అందుకు జీహెచ్ఎంసీ పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది.
పైగా, కవితకు సంబంధించిన ఫ్లాట్ను కూడా తనకే అమ్మాలంటూ సి.కళ్యాణ్ బెదిరింపులకు దిగాడు. దీంతో కవిత జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో సి.కళ్యాణ్పై 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.