'గడ్డం గ్యాంగ్' ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. డా. రాజశేఖర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'గడ్డం గ్యాంగ్'. తమిళంలో విజయవంతమైన 'సూదుకవ్వుమ్' చిత్రానికి రీమేకిది. బిందాస్ ఫేమ్ షీనా కథానాయికగా నటిస్తోంది. శరవణన్ శిష్యుడు పి. సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. శివాని, శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్నారు.
చిత్రం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జీవిత మాట్లాడుతూ.. రాజశేఖర్ గడ్డం దాస్గా నటిస్తున్నారు. ఇంతకుముందు కనిపించని కొత్త పాత్ర అది. అచ్చు సంగీతం అందించడమే కాకుండా ఇందులో ఓ పాత్రను పోషిస్తున్నారు. నవంబర్ మొదటి వారంలో పాటల్ని, నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.