దీంతో బిజీ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఆనంద డోలికల్లో తేలియాడుతోంది. ఇంకా చెప్పాలంటే, షారూఖ్ ఖానే ఆయనే రకుల్ సెట్లోకి వచ్చాడు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్లో రమేష్ సిప్పీ నిర్మిస్తున్న 'సిమ్లా మిర్చి' సినిమాలో నటిస్తోంది.
రమేష్ సిప్పీతో షారుఖ్కి ఎంతో అనుబంధం వుంది. దాంతో ఆయనను కలవడానికి వచ్చి యూనిట్ అందరితోనూ కాసేపు ముచ్చటించాడు. అప్పుడే రకుల్ని ఆయనకు పరిచయం చేశారు. "షారుఖ్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకు వీరాభిమానిని. అలాంటిది ఆయనను తొలిసారిగా కలవడం కల నిజమైనట్టుగా అనిపిస్తోంది. ఆ సమయంలో షారుఖ్ మాతో ఎన్నో కబుర్లు చెప్పాడు" అంటూ మురిసిపోతోంది రకుల్ ప్రీత్ సింగ్