టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ప్రేమకథా చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో బన్నీ రొమాన్స్ చేస్తాడనీ, సమంతను లీడ్ హీరోయిన్ గా ఆదాశర్మను మరో హీరోయిన్ గా తీసుకున్న సంగతి ఇప్పటికే వెబ్ దునియా తెలిపింది. ఇప్పుడిక మూడో కథానాయిక పాత్ర కోసం ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఆకట్టుకొన్న కథానాయిక రాశీఖన్నాను తీసుకున్నట్లు టాలీవుడ్ న్యూస్.
స్క్రిప్ట్లో మార్పుల కోసం లేటుగా ప్రారంభమైన ఈ సినిమాలో బన్నీ ముగ్గురు కథానాయికలతో రొమాన్స్ చేయనున్నారు. వీరిలో ఇంతకుముందే సమంతా, ఆదాశర్మ ఎంపికయ్యారు. ఇక కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడు. 'రేసుగుర్రం' వంటి భారీ హిట్ సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో నిర్మాణం పరంగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.