శేషాచలం ఎన్కౌంటర్ తర్వాత ఎర్ర చందనం స్మగ్లింగ్పై ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసు ఉక్కుపాదం మోపడమే కాకుండా, ఈ స్మగ్లింగ్లో సంబంధం ఉన్న వ్యక్తుల కూపీ లాగుతున్నారు. ఇందులో టాలీవుడ్, కోలీవుడ్కు చెందిన పలువురు ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే సినీ నటి రీతూ అగర్వాల్ పైన కర్నూలు జిల్లాలో పోలీసు కేసు నమోదైంది.
రీతూ ఆగర్వాల్కు మస్తాన్ వలీ రూ.35 లక్షల విలువైన ఓ ఫ్లాట్ను బహుమతిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ వలీ - నీతూ అగర్వాల్ అకౌంట్ల మధ్య ఆర్థిక లావాదేవలు జరిగినట్లుగా వెల్లడైంది. ఇప్పటికే మస్తాన్ వలీ, ఆయన సోదరుడు ఎర్రచందనం కేసులో అరెస్టయ్యారు. రీతూ అగర్వాల్ పైన రుద్రవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె దొరికితే మరిన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు. ఆమె ముంబై లేదా బెంగళూరులలో ఉండవచ్చొని భావించి ఆమె కోసం గాలింపు ప్రారంభించారు.
మరోవైపు.. నీతు బ్యాంకు ఖాతాల నుండి మస్తాన్ వలీ ఇతర స్మగ్లర్లకు నిధులు బదలీ చేసినట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలిందని తెలుస్తోంది. దీంతో ఆమె బ్యాంకు ఖాతాల పైన నిఘా పెట్టగా ఆ ఖాతాలో నగదు నిల్వ లేనట్లు గుర్తించారని సమాచారం. మస్తాన్ వలీ అనుచరుడు శంకర్ నాయక్కు నీతూ అగర్వాల్ ఖాతా నుండి నగదు బదలీ చేసినట్లుగా గుర్తించారు. ఎర్రచందనం కేసులో వీరితో పాటు చెన్నై సినీ నిర్మాతలు కూడా ఉన్నారని అనుమానిస్తున్నారు.