వివాదాలకు నిలయమైన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ జీవిత కథ వెండితెరపై రాబోతోంది. ఈ సినిమా 'నేను నేనే రామునే' పేరిట రూపొందింది. ఈ చిత్రానికి రత్నాచారి పమ్మి దర్శకత్వం వహించాడు. ఈ నెల 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు, 'బుద్ధిమంతులకు మాత్రమే' అనే ట్యాగ్ లైన్ పెట్టినట్టూ దర్శకుడు తెలిపారు.