నారా రోహిత్ హీరోగా మూవీ మిల్స్, సినిమా 5 పతాకంపై రూపొందిన చిత్రం 'రౌడీఫెలో'. విశాఖ సింగ్ హీరోయిన్. ప్రకాష్రెడ్డి నిర్మాత. కృష్ణచైతన్య దర్శకుడు. ఈనెల 21న విడులైన చిత్రం మంచి కలెక్షన్లతో రన్ అవుతుందని దర్శక నిర్మాతలు విజయసభ ఏర్పాటు చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ... నారా రోహిత్ కథను నమ్మి నటించాడు. నిజాయితీగా సినిమా తీస్తే అందరికీ నచ్చుతుందని రుజువయింది అన్నారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలన్నింటిలో ఈ సినిమానే బెస్ట్ సినిమా. కథ, డైలాగ్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అన్నీ వున్నాయి. ఇంకా ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా' అన్నారు.