అనుష్క టైటిల్ పాత్రధారిణిగా నటిస్తున్న 'రుద్రమదేవి' సినిమా మార్చిలో విడుదల కానుంది. మార్చి చివరి వారంలో దీనిని రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాత గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నారు. భారతదేశపు తొలి చారిత్రాత్మక స్టీరియో ఫోనిక్ త్రీడీ చిత్రంగా పేరు తెచ్చుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.