స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో తెరకెక్కిన 's/o సత్యమూర్తి' వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ అనే టాక్ పొందడంతో చిత్ర యూనిట్ అంతా యమా హ్యాపీగా వుంది.
ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకునేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది. అందుకోసం ఏప్రిల్ 18న హైదరాబాద్లో వైభవంగా థాంక్స్ మీట్ను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో సన్నాఫ్ సత్యమూర్తి చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంటుందని సమాచారం. కాగా గతంలో బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది చిత్రానికి సైతం ఇదే తరహాలో థాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.