తాజా సమాచారం ఏమిటంటే సత్యదేవ దర్శకత్వంలో రమణారావు నిర్మిస్తున్న ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్ని జెమిని టీవీ దాదాపు 6 కోట్ల రూపాయలకి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లయన్ శాటిలైట్ రైట్స్ కోసం మూడు చానల్స్ పోటీ పడి....గతంలో లెజెండ్ సినిమాని దక్కించుకున్న జెమిని టీవీనే భారీ ధర చెల్లించి లయన్ సినిమా రైట్స్ ని కూడా పొందినట్టు టాక్. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.