నాకు నచ్చిన వాడు సాంబార్ అన్నంలా ఉంటాడు: శృతి హాసన్

శనివారం, 25 ఏప్రియల్ 2015 (14:18 IST)
''నాకు నచ్చినవాడు సాంబారు అన్నంలా ఉంటాడని'' శృతిహాసన్ షాకిచ్చింది. తన మనసుకు నచ్చని వ్యక్తి తారసపడకపోతే.. పెళ్లి ఆలోచనే చేయనని శృతి స్పష్టం చేసింది. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనే వస్తే చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తినే చేసుకుంటానని చెప్పింది. తన తల్లిదండ్రులు చిత్రపరిశ్రమకి చెందినవారు కావడం ఒక కారణమైతే, తనకి ఇష్టమైన ఈ రంగం పట్ల తనకి కాబోయేవాడికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 
 
అయితే ఇంతవరకూ తన మనసుకి నచ్చినవాడు తారసపడలేదు కాబట్టి, కెరియర్ పైనే దృష్టిపెట్టానని తెలివిగా సమాధానమిచ్చింది. ప్రస్తుతానికి పెళ్లి సంగతిని పక్కనబెట్టి చేతిలో ఉన్న సినిమాలపై దృష్టి పెట్టానని.. మనస్సుకు నచ్చినోడు దొరికితే వెంటనే పెళ్లి చేసేసుకుంటానని శృతిహాసన్ చెప్పుకొచ్చింది.

వెబ్దునియా పై చదవండి