టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ మూడు భాషల్లో ఏక కాలంలో బిజీ బిజీగా ఉన్న ఏకైక నటి శ్రుతి హాసన్. ఒక వైపు చెన్నై నుంచి ముంబైకి, ముంబై నుంచి హైదరాబాద్కు అంటూ విమానాల్లో చెక్కర్లు కొడుతున్న అమ్మడుకి క్షణం తీరిక లేకపోయినా వచ్చే ఆఫర్లను కాదనడం లేదు. తాజాగా శ్రుతిని మరో భారీ ఆఫర్ వరించింది.
ప్రస్తుతం శ్రుతి తెలుగులో మహేష్ బాబుతో 'శ్రీమంతుడు', తమిళంలో విజయ్తో 'పులి', హిందీలో అక్షయ్ కుమార్తో 'గబ్బర్ ఈజ్ బ్యాక్' చిత్రాలలో నటిస్తుంది. అలాగే త్వరలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం కూడా ఈ ముద్దుగుమ్మకు వచ్చింది.