'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో' అనే రీతిలో, వచ్చే అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్న అందాల రాసి శ్రుతి హాసన్. అమ్మడు ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ 'త్రిభాషా సుందరి'గా పేరు తెచ్చుకుంది.
ఇదిలా ఉంచితే, తాజాగా మరో స్టార్ హీరో అజిత్ సరసన నటించే ఛాన్స్ కూడా ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టుగా సమాచారం. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయికగా శ్రుతిని ఎంపికచేసుకున్నారట. ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. కాగా శ్రుతి ప్రస్తుతం తెలుగులో ప్రిన్స్ మహేష్ బాబు సరసన 'శ్రీమంతుడు' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.