ప్రముఖ సినీ నటి శ్రుతిహాసన్పై నమోదైన ఛీటింగ్ కేసు దర్యాప్తు ఊపందుకుంది. ఇప్పటికే హైదరాబాద్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు ఈ కేసు బదిలీ అయ్యింది. ఒప్పందం సమయంలో కాల్షీట్లు ఇచ్చి షూటింగ్ సమయంలో తనకు కుదరదంటూ దర్శక, నిర్మాతలను మోసం చేసిందని శ్రుతిహాసన్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఒప్పందంపై సంతకాలు, అడ్వాన్స్ చెల్లింపులు, కాల్షీట్ల డేట్లు తదితర ప్రక్రియ మొత్తం బంజారాహిల్స్ రోడ్ నెంబరు:2 లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిందట. ఈ ప్రాంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు, సోమవారం కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.