ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా అవతారమెత్తనున్నాడు. తొలి ప్రయత్నంగా ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించే సన్నాహాలు చేస్తున్నారు. పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్ బండ్రెడ్డి, థామస్రెడ్డి ఆదూరితో కలిసి సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కరెంట్’ చిత్రానికి దర్శకత్వం వహించిన పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తాడు.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తారు. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఈ చిత్రానికి పనిచేయనున్నారు. మగధీర, అత్తారింటికి దారేది వంటి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన రవీంద్ర ఈ చిత్రానికి పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.