సినీనటి శ్వేతబసు ప్రసాద్ తల్లి వద్ద ఉండేందుకు అంగీకరించడంతో తల్లి సంరక్షణకు సినీనటి శ్వేతబసు ప్రసాద్ను అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమ కుమార్తెను బాగా చూసుకుంటామని, ఆమెను రెస్క్యూ హోంలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ శ్వేత తల్లి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి విచారించారు.
శ్వేత, ఆమె తల్లి ఇద్దరి వాంగ్మూలం తీసుకున్న కోర్టు పిటీషన్ను ఆమోదించింది. సినీనటి శ్వేతబసుప్రసాద్ను చార్మినార్ వద్ద ఉన్న ఓ రెస్క్యూ హోంకు తరలిస్తూ ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.