మిల్కీ బ్యూటీ తమన్నాతో కృష్ణవంశీ.. గోవిందుడు తర్వాత హిట్ కోసం..

శుక్రవారం, 19 డిశెంబరు 2014 (11:10 IST)
''గోవిందుడు అందరి వాడేలే'' మోస్తరు ఫలితాలను ఇవ్వడంతో కృష్ణవంశీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా మిల్కీ బ్యూటీ తమన్నాతో తొలిసారిగా కృష్ణవంశీ సినిమా చేస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్, దిల్ రాజు కలసి కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిన్న చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ కథతో రూపొందుతుందని అంటున్నారు. 
 
ఈ సినిమాలో కథానాయిక పాత్రకు తమన్నాను తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయంలో ప్రస్తుతం మిల్కీ బ్యూటీతో చర్చలు జరుగుతున్నాయట!

వెబ్దునియా పై చదవండి