ప్రస్తుతం తెలుగు సినిమాకు చెందిన 24 క్రాఫ్ట్కు చెందిన కార్మికులంతా రోడ్డునపడ్డారు. అంటే పనీపాటా కోసం కాదు. వారికి తగిన పారితోషికం ఇవ్వాలని. గత కొన్నేళ్ళుగా కార్మికుల చట్టంలోని పాత నిబంధన ప్రకారం.. ఇస్తున్న వేతనాలను రెండేళ్ళకొకసారి పెంచాల్సి వుంటుంది. కానీ చాలామంది నిర్మాతలు దానికి అనుగుణంగా ఇవ్వకపోడంతో గత ఏడాది జూన్లో దీక్షలు చేపట్టారు.
ఛాంబర్ పెద్దలు కలుగజేసుకుని.. అన్ని శాఖల నాయకులు రాజీపడే ప్రయత్నాలు చేశారు. జూనియర్ ఆర్టిస్టుకు 750 నుంచి 1000 రూపాయల వరకు రోజుకు వేతనం వుంటుంది. అదేవిధంగా ఆర్ట్, లైట్బాయ్.. ఇలా అన్ని శాఖలకు ప్రస్తుతం వున్న వేతనాలను 50 శాతం పెంచాలని కార్మిక సమాఖ్య డిమాండ్ చేస్తుంది. అధ్యక్షుడు కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు దాసరి మద్దతుందని తెలుస్తోంది.